అవును.. 2006 లోనే.. కోహ్లీ ఏంటో అందరికీ తెలిసింది?
అయితే క్రికెట్ పట్ల విరాట్ కోహ్లీకి ఉన్న డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా జట్టుకు విజయాన్ని అందించడం కోసం కోహ్లీ అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేసి చూపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. సాధారణంగా కోహ్లీ స్టార్ క్రికెటర్గా ఎదిగిన తర్వాత అతనికి ఆటపట్ల ఉన్న అంకితభావం గురించి క్రికెట్ ప్రపంచానికి అర్థమైంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అంతర్జాతీయ జట్టులోకి అరంగేట్రం చేయకముందే కోహ్లీ క్రికెట్ పట్ల తన అంకితభావం ఏంటో అన్న విషయాన్ని ప్రపంచానికి రుజువు చేశాడు.
2006 డిసెంబర్ 18వ తేదీన ఉదయం సమయంలో నూనుగు మీసాల కోహ్లీ రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఇక మ్యాచ్ లో బాగా రాణించేందుకు కోహ్లీ కూడా ప్రాక్టీస్ లో మునిగి తేలాడు. కానీ అంతలో ఊహించని చేదువార్త. తనను వెన్ను తట్టి ముందుకు నడిపించిన తండ్రి ఇక లేడు అన్న విషయం కోహ్లీకి తెలిసి గుండె పగిలిపోయింది. ఆ సమయంలో కోహ్లీ ప్లేస్ లో ఎవరున్నా కన్నీరు పెట్టుకుంటూ తండ్రి అంత్యక్రియలకు వెళ్లేవారు. కానీ కోహ్లీ మాత్రం తండ్రి కోరికను నెరవేర్చాలని.. తనను నమ్ముకున్న జట్టును గెలిపించాలని కొండంత బాధను గుండెల్లో దాచుకొని క్రికెట్ ఆడాడు. ఏకంగా ఆ మ్యాచ్ లో 90 రన్స్ చేసి ఢిల్లీని గెలిపించి.. చివరికి తన తండ్రి అంత్యక్రియలు చేసేందుకు వెళ్లాడు. ఇలా 18 ఏళ్ల వయసులోనే కోహ్లీ కమిట్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం క్రికెట్ ప్రపంచానికి అర్థమైంది.