పాకిస్తాన్ ను.. వారి సొంతదేశంలో ఓడించడం ఆనందాన్నిచ్చింది : వసీం జాఫర్
అయితే ఇక వసీం జాఫర్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఎప్పుడు ఏ పోస్ట్ వచ్చిన కూడా అది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల వసీం జాఫర్ పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా పాకిస్తాన్ జట్టును వారి సొంత దేశంలోనే ఓడించడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది అంటూ వసీం జాఫర్ పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. దీంతో ఈ పోస్ట్ చూడగానే వసీం జాఫర్ ఇలా పోస్ట్ ఎందుకు పెట్టాడబ్బా అని కాస్త లోతుగా వివరాలు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పాలి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ అండర్ 19 జెజట్టు ట్ ఇటీవల పాకిస్తాన్లో పర్యటించి మంచి ప్రదర్శన కనబరిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ లో భాగంగా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక టి20 సిరీస్ లో కూడా పాకిస్తాన్ కు షాక్ ఇచ్చి 1-1 తో సిరీస్ సమం చేసింది. అయితే ఇక ఇలా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన బంగ్లాదేశ్ అండర్ 19 జట్టుకి బ్యాటింగ్ సలహాదారుగా ఉన్నాడు భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్. ఇక అండర్ 19 జట్టు కుర్రాళ్ల ఆట తీరుపై సంతోషం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ ను వారి సొంత దేశంలోనే ఓడించడం వృత్తిపరంగా సంతృప్తిని ఇచ్చింది అంటూ కామెంట్ చేయగ అది కాస్త హాట్ టాపిక్గా మారింది.