టీమిండియా గెలిచినా.. అతను ప్రేక్షకుల మనసు దోచాడు?
ఇలాంటి ఉత్కంఠభరితమైన టి20 ఫార్మాట్లో హ్యాట్రిక్ సాధించడం అంటే అది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. అంతేకాదు హ్యాట్రిక్ సాధించాలి అంటే అటు హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో అదృష్టం కూడా అంతే కలిసి రావాలి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు వరుసగా రెండు వికెట్లు తీసినప్పటికీ చివరికి మూడో వికెట్ సమయంలో మాత్రం ఎంతో మంది ఆటగాళ్లకు నిరాశ ఎదురవుతుంది. చివరికి హ్యాట్రిక్ సాధించాలని చాన్స్ ను పోగొట్టుకుంటూ ఉంటారు.
ఇకపోతే భారత్ న్యూజిలాండ్ మధ్య అటు కివీస్ గడ్డపై టి20 సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా.. ఇటీవల రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 65 పరుగులు తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయినప్పటికీ అటు న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌదీ మాత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఏకంగా తీవ్ర ఒత్తిడితో కూడిన చివరి ఓవర్ లో హ్యాట్రిక్ సాధించాడు టీం సౌధి. ఇక చివరి ఓవర్ లో మూడు నాలుగు ఐదు బంతుల్లో హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు అని చెప్పాలి అయితే టీ20 లో ఇతనికి ఇది రెండో హ్యాట్రిక్ కావడం గమనార్హం .