హెరాల్డ్ సెటైర్ : ఇదేపని మిగిలిన వాళ్ళు కూడా చేస్తే చంద్రబాబు ముణిగిపోవటం ఖాయమేనా ?
నిజానికి గవర్నర్ చర్యను నిరసిస్తు భారీ ఎత్తున ఉద్యమాలు చేయాలి, ఆందోళనలకు నాయకత్వం వహించాలి కానీ మరీ ఇలా సమయం చూసి తప్పించుకుంటారా ఎవరైనా ? చివరకు రవి రాజీనామా ఏమవుతుందన్నది వేరే సంగతి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బిటెక్ రవినే ఆదర్శంగా తీసుకుని మిగిలిన ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు కూడా ఇదే పని చేస్తే చంద్రబాబు పనేమవుతుంది ? అన్నదే ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది టిడిపిలో ఉండలేకపోతున్నారు. అధికారానికి అలవాటైన ప్రాణాలు ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నాయట. చంద్రబాబుతో పడక+ఇతరత్రా కారణాలతో 23 మంది ఎంఎల్ఏల్లో ఇప్పటికే ముగ్గురు పార్టీకి దూరమైపోయిన విషయం అందరికీ తెలిసిందే.
పార్టీకి దూరమైన ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, కరణం బలరామ్, మద్దాలి గిరిధర్ ఇటు టిడిపిలో కంటిన్యు అవటం లేదు అటు వైసిపి తీర్ధమూ పుచ్చుకోలేదు. వ్యూహాత్మకంగా మధ్యేమార్గం అనుసరిస్తున్నారు. ఇదే పద్దతిలో ప్రయాణించటానికి ఇంకొందరు ఎంఎల్ఏలు కూడా రెడీ అవుతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రకాశం జిల్లాలో మిగిలిన ముగ్గురు ఎంఎల్ఏలు, వైజాగ్ జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఎంఎల్ఏ పేరు బాగా ప్రచారంలో ఉంది. ఎంఎల్సీలు రాజీనామాలు చేస్తే వెంటనే ఆమోదం పొందే అవకాశం లేదు. అదే ఎంఎల్ఏలు రాజీనామాలు చేస్తే వెంటనే స్పీకడర్ తమ్మినేని సీతారామ్ వాటిని ఆమోదించే అవకాశం ఉంది. రాజీనామా చేసే ఉద్దేశ్యం ఉన్న ఎంఎల్ఏలు కూడా గవర్నర్ చర్యకు నిరసన అనే చెబుతారు. దాన్ని చంద్రబాబు కూడా కాదనలేడు.