
హెరాల్డ్ సెటైర్ : ఎంపి మాటలు మామూలుగా లేవుగా...కోటలు దాటిపోతున్నాయా ?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపి కూడా జగన్ ను నేరుగా ఏమీ అనకుండానే ప్రభుత్వాన్ని పార్టీని జనాల్లో గబ్బు పట్టించేందుకు వీలైనంతగా కష్టపడుతున్నాడు. అందుకు అవకాశం ఉన్న ఏ చిన్న ఘటనను కూడా వదులుకోవటం లేదు. పనిలో పనిగా ఢిల్లీలో బిజెపి పెద్దలతో లాబీయింగ్ చేసుకుంటునే రాష్ట్రంలో ప్రతిపక్షాలకు దగ్గరగా మెలుగుతున్నాడు. ఇదే సమయంలో జగన్ను తీవ్రంగా వ్యతిరేకించే మీడియాతో కూడా సన్నిహిత సంబంధాలు కంటిన్యు చేస్తున్నాడు. ఎంపి ఇదంతా కావాలనే చేస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ పై క్రిస్తియన్ అనే ముద్రవేసి హిందువులకు దూరం చేసే ప్రయత్నాలు కూడా జోరుగానే చేస్తున్నాడు. అందుకనే ఈమధ్యనే తగలబడిన అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఆలయం రథం ఘటనలో కూడా మతపరమైన కుట్ర ఉందంటు పదే పదే ఆరోపణలు చేశాడు.
సరే ఈ గొడవలు ఇలాగుండగానే హఠాత్తుగా తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. నిజానికి మొన్నటి ఎన్నికల్లో వైసిపి తరపున ఎంపిగా కృష్ణంరాజు కాకుండా ఇంకెవరైనా పోటి చేసుంటే ఇంతకన్నా మంచి మెజారిటినే వచ్చుండేదని పార్టీలో చర్చ జరుగుతోంది. చివరి నిముషంలో పార్టీలో చేరిన కృష్ణంరాజుకు టికెట్ ఇవ్వటమే జగన్ చేసిన తప్పు. అయితే ఎందుకిచ్చిడంటే అప్పటి పరిస్ధితులు+ఎంఎల్ఏ అభ్యర్ధులు కూడా పట్టుబట్టడంతో ఈయనకు టికెట్ ఇవ్వక జగన్ కు తప్పలేదు. దాంతో తన వల్లే వైసిపి నరసాపురంలో గెలిచిందని ఎంపి విచిత్రమైన వాదన వినిపిస్తున్నాడు. తనను పార్టీలో చేరి పోటి చేయమని జగన్ బతిమలాడటం వల్లే వైసిపిలో చేరానంటు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.