హెరాల్డ్ సెటైర్ : లోకేష్ కెపాసిటి ఏమిటో తొందరలోనే తేలిపోతుందా ?
కేంద్రం చట్టం చేయకముందు ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లును అన్నీ పార్టీలు పరిశీలించాయి. పరిశీలనదశలోనే అకాలీదళ్ లాంటి కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. మరికొన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. సానుకూలంగా స్పందిచన పార్టీల్లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు కూడా ఉన్నాయి. తర్వాత చట్టం రూపొందించేదుకు బిల్లును కేంద్రం పార్లమెంటును ప్రవేశపెట్టినపుడు వైసీపీ, టీడీపీ ఆమోదించాయి. ఆ తర్వాత చట్టమైన బిల్లునే కేంద్రం దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. అంటే వ్యవసాయ సంస్కరణల్లో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటమన్నది ఓ భాగమని టీడీపీకి ముందే తెలుసు. తెలిసి పార్లమెంటులో మద్దతిచ్చింది. అదే చట్టాన్ని అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటుంటే టీడీపీ వ్యతిరేకిస్తోంది. అంటే టీడీపీ ఢిల్లీలో ఒకలాగ రాష్ట్రంలో మరోలాగ డబల్ గేమ్ ఆడుతోందన్న విషయం అర్ధమైపోయింది. మీటర్లు బిగిస్తే రైతులకు నష్టం అన్న వాదన టీడీపీ వినిపిస్తోంది. మరి ఇదే వాదన పార్లమెంటులో ఎందుకు వినిపించలేదు ? బిల్లును పార్లమెంటులో ఎందుకు వ్యతిరేకంచలేదు ? అన్నది ప్రశ్న.
సరే ఇక ప్రభుత్వ వాదన చూస్తే మీటర్లు బిగించినంత మాత్రన రైతులపై భారం పడదని చెబోతోంది. రైతులు చెల్లించాల్సిన మొత్తం విద్యుత్ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతోంది. నిజానికి మీటర్లు బిగిస్తే కానీ వ్యవసాయరంగంలో ఎంత విద్యుత్ వాడుతున్నారన్న విషయం తెలీదు. ఏ సమయంలో రైతులు ఎక్కువగా విద్యుత్ వాడుతున్నరనే లెక్కలు కూడా కచ్చితంగా తెలిసిపోతోంది. దానికి తగ్గట్లే విద్యుత్ సరఫరాను సరిచేసుకునే అవకాశం కూడా ఉంది. ఇదే సమయంలో రైతులకు ఇస్తున్న వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి కూడా లెక్కలొస్తాయి. బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందా లేదా అన్న విషయం ముందు మీటర్లు బిగిస్తేనే కదా తెలిసేది ? మీటర్లు బిగించిన తర్వాత బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోతే అపుడు ఉద్యమం చేస్తామని లోకేష్ చెప్పినా బాగుంటుంది. అసలు మీటర్లు బిగించటాన్నే వ్యతిరేకిస్తామంటూ ప్రభుత్వం వింటుందా ?