ఎంఐఎంకు టీఆర్ఎస్ మధ్య ఎటువంటి పొత్తు కానీ అవగాహన కానీ లేదని కేటీయార్ చెప్పుకుంటున్నారంటేనే అర్ధమైపోతోంది టీఆర్ఎస్ ఎంత డిఫెన్సులో పడిపోయిందో. ఇక్కడ విచిత్రమేటంటే జీహెఛ్ఎంసి ఎన్నికలపై చర్చించేందుకు కేసీయార్ నిర్వహించిన సమావేశానికి మంత్రులు, కీలక నేతలతో పాటు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ కూడా హాజరయ్యారట. టీఆర్ఎస్ తో ఎంఐఎంకు సంబంధాలు లేకపోతే మరి అసదుద్దీన్ ఎలా హాజరయ్యారు ? ఎందుకు హాజరైనట్లు ? ఇక్కడే బీజేపీ నేతల ఆరోపణలు జనాల్లోకి చాలా గట్టిగా వెళ్ళిపోయింది. కమలంపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం కేసీ