హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

KISHORE
ఏపీ లో బి‌జే‌పి నేతలు మరొకసారి సి‌ఎం జగన్ పైన విరుచుకుపడ్డారు.జగన్ ప్రభుత్వం ఒక నియంత పాలనలో నడుస్తుందని,ఆ నియంత ఒక పిచ్చి తుగ్లక్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు బి‌జే‌పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణు కుమార్ రాజు . ఉత్తర కొరియా నియంత కిమ్‌ అయితే ఏపీ నియంత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.సి‌ఎం జగన్ ప్రజలను మబ్యపెట్టేందుకు చెప్పేదొకటి చేసేదొకటిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటుగా ఆరోపించారు.

అధికారం లోకి వచ్చిన తరువాత రెండున్నరేళ్ల గడిచే సరికి  మంత్రివర్గాన్ని మారుస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా సీఎం చెప్పారు. అదే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వమే మారిపోవచ్చని వ్యాఖ్యానించారు.వైస్ జగన్ గారి బదులుగా ఆయన‌ సతీమణి భారతి సీఎం అయ్యివుంటే ఏపీ రాష్ట్ర ప్రజలు సంతోషిచేవారని’’ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.

స్థానిక ఎన్నికలు జరగకుండా ఎందుకు అడ్డు పడుతున్నారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.ఎన్నికల కమిషన్ మీద కక్ష పూరిత రాజకీయాలు చెయ్యడం సరికాదన్నారు.స్థానిక ఎన్నికలతో జగన్ గారికి ఓటమి భయం పట్టుకుందని ఏపీ బి‌జే‌పి రాష్ట్ర ఉప అధ్యక్షుడు విష్ణుకుమార్  రాజు వ్యాఖ్యానించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: