కడప జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు పంచాయితిల్లో టీడీపీ మద్దతుదారులు ఖాతానే తెరవలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్చ, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, నెల్లూరు రూరల్, అనంతపురం హెడ్ క్వార్టర్స్ నియోజకవర్గంలో కూడా పసుపు పార్టీ మద్దతుదారుల్లో ఒక్కళ్ళు కూడా గెలవలేదు. ఇలా నూరుశాతం అధికారపార్టీనే గెలవటం గతంలో ఎప్పుడు జరగలేదంటున్నారు. కడప జిల్లాలోని పులివెందులలో టీడీపీ గెలవలేకపోయిందంటే అర్ధముంది. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు. పైగా ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అక్కడ