సరికొత్త టెక్నాలజీతో ఎస్వీబీసీ చానెల్ రూపురేఖలు మారుస్తా
తమ చానెల్ కు కీరవాణి సునీత లాంటి వాళ్లు అవసరం లేదని.. స్థానికంగా చాలా మంది అద్భుతమైన గాయకులు ఉన్నారని ఫృథ్వీ స్పష్టం చేశారు. స్థానిక కళాకారులతోనే మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు ఫృథ్వీ. నేను నెలలో 20 రోజులు ఇక్కడే ఉండి స్వామి వారికీ సేవ చేస్తానని స్పష్టం తెలియ చేశారు. మాజీ చైర్మన్ రాఘవేంద్రరావుకు గడ్డం ఉంటుంది..కానీ నాకు ఉండదు అదే తేడా అని ఫృథ్వీ చెప్పుకొని వచ్చారు.
మాజీ ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ ఐనా దర్శకుడు రాఘవేంద్రరావు గురించి ప్రెసెంట్ ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీ కామెంట్ చేశారు ఇలా. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉందని.. ఎస్వీబీసీలోని ఉద్యోగులకు భద్రత సౌకర్యాలు సరికొత్త టెక్నాలజీతో చానెల్ రూపురేఖలు మారుస్తానని స్పష్టం తెలిపారు. సరి కొత్త అద్భుతమైన గాయకులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాను అనీ తెలిపారు.