తిరుమల సమాచారం 24-12-2019
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు మంగళవారం,24.12.2019 ఉదయం 6 గంటల సమయానికి,తిరుమల: 19C°-24℃°
• నిన్న 78,349 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 24 గదిలో భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు 24 గంటలు పట్టవచ్చును.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.64 కోట్లు.
• నిన్న 30,529 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న 19,406 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.
గమనిక:
జనవరి 1, వైకుంఠ ఏకాదశి సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని దాతలకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను నిలుపుదల చేయడమైనది.
• నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30 నుండి జనవరి 1వ తేదీ వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును నిలిపివేయడమైనది.
• భక్తుల రద్దీ నేపథ్యంలో నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది.
ఈనెల తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు
• రేపు శ్రీతొండర డిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
• 26న సూర్యగ్రహణం.
• 31 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.