తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుణ్యక్షేత్రాల్లో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది తిరుపతి. చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం  వెలసింది. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు రోజూ కొన్ని లక్షల్లో వస్తూ ఉంటారు. కాలినడకన వచ్చి శ్రీవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గోవిందా గోవిందా అంటూ ఈ తిరుపతిని పవిత్ర క్షేత్రంగా చేశారు. ఏడుకొండల మీద వెలసిన శ్రీవారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి