పురాణ‌ప్రేమ‌: రాక్ష‌సిని ప్రేమించి పెళ్లాడిన పాండ‌వులెవ‌రో తెలుసా... !

Kavya Nekkanti

శౌర్యప్రతాప పరాక్రమాలకు ప్రతీకలుగా పంచపాండవ్ఞలైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవ్ఞలు, వ్యాసవిరచిత మహాభారతంలో మహానుభావ్ఞలుగా, మహిలో వినుతిగాంచిన పురాణ ప్రముఖులు. ముఖ్యంగా భీమసేనుడు పాండవుల్లో మధ్యవాడు. కుంతీదేవికి పాండురాజుకీ వాయు దేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడు. శారీరక బలం దృష్ట్యా ఇతను పదివేల ఏనుగుల బలమున్నవాడు. అయితే మహాభారతంలో కండలవీరుడు భీముడిని ఇష్టపడుతుంది హిడింబి అనే రాక్షస వనిత.

 

పాండవులు లక్కఇంటి నుంచి తప్పించుకున్న తర్వాత అడవిలోకి వెళ్తారు. ఆ స‌మ‌యంలో మిగిలిన వాళ్లందరూ నిద్రపోతుంటే భీముడు కాపలా కాస్తూ ఉంటాడు. వాసనతో వాళ్లను గుర్తుపట్టిన హిడింబాసురుడు, చెల్లెలు హిడింబిని పంపించి వాళ్ల వివరాలు కనుక్కోమంటాడు. కానీ హిడింబి భీముడిని తొలి చూపులోనే ప్రేమిస్తుంది. భీముడు కాదన్నా, అతడిపై ఉన్న ప్రేమతో ‘మా అన్నవల్ల మీకు ముప్పు ఉంది, ఈ ప్రాంతాన్ని వదిలి పొమ్మ’ని సలహా ఇస్తుంది. భీముడు యుద్ధంలో హిడింబాసురుడిని చంపుతాడు. తర్వాత హిడింబి భీముడిని పెళ్లిచేసుకోమని అడుగుతుంది. 

 

కొంతకాలమే కలిసి ఉంటాను, తర్వాత మేం వెళ్లిపోతాం అని భీముడు పెట్టిన షరతులకు ఒప్పుకుని {{RelevantDataTitle}}