చనిపోయిన తరువాత స్వర్గానికి వెళ్లాలంటే...ఇవితప్పక పాటించాలి...?

VAMSI
హిందూ ధర్మం ప్రకారం 15 రోజుల్లో విభిన్నమైన తిథుల్లో వారికి పిండాలను అర్పించవచ్చు. ఈ పక్షం రోజులను తీవ్రమైన సమయంగా పరిగణిస్తారు. అన్ని భాహ్యవిషయాలను మనస్సులో నుంచి తీసి.. పూర్వీకులపైనే పూర్తిగా మనసు లగ్నం చేసి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనసులో ఎన్నో అనుమానాలు, సందేహాలు కలుగుతాయి. స్వర్గం-నరకం, జననం-మరణం, ఆత్మ-పరమాత్మ, ప్రజా జీవితం లాంటి సంబంధిత విషయాలు మన మనసులోకి రావడం సహజం. ఈ రోజు మనం ఇలాంటి లక్షణాల గురించే చర్చించబోతున్నాం. ఎవరైన వ్యక్తి తాను మరణించే సమయంలో లేదా తన చివరి క్షణాల్లో కొన్ని లక్షణాలు లేదా కొన్ని అంశాల గురించి ఆలోచించినట్లయితే స్వర్గాన్ని పొందుతారని నమ్ముతారు.

 కృష్ణుడి భగవద్గీత ప్రకారం శరీరంలో 9 ప్రధాన ద్వారాలు(నవ రంధ్రాలు) ఉన్నాయి. ఎవరైతే తమ జీవితంలో పుణ్యాలు అంటే సకారాత్మక క్రియలు చేసినవాళ్లు శరీరం ఎగువ ద్వారం నుంచి వారి ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో కళ్లు, ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి. జీవితాంతం సద్గుణమైన పనులు చేయడంలో నిమగ్నమైన వాళ్లు గొప్ప వ్యక్తులుగా కీర్తి తెచ్చుకుంటారు. వారి ఆత్మలు ఈ ద్వారాల గుండా బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే ముక్కు కొంచెం వక్రంగా మారుతుందని నమ్మకం. కళ్లు నుంచి బయటకు వస్తే కళ్లు మూసుకోరు, చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే చెవి పైకి లాగినట్లు కనిపిస్తుంది. నోరు నుంచి అయితే నోరు తెరుచుకుంటుంది.

బతికున్న రోజుల్లో ఎలాంటి పనులు, వ్యవహారాలు చేసినప్పటికీ మరణించే సమయంలో వ్యక్తి సంతృప్తిగా, ముఖంలో సంతోషం ఉంటే వారు స్వర్గానికి వెళతారని నమ్ముతారు. ఇదే సమయంలో తప్పు లేదా పాపం చేసిన, పాపాత్మకచర్యలకు పాల్పడిన వారి ముఖంలో మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వ్యక్తి సంతృప్తిగా, సంతోషంగా చనిపోయినట్లయితే వారిక పరలోకం ప్రాప్తిస్తుంది. మరణభయంతో చనిపోయిన వారికి నరకానికి వెళ్తారని చెబుతారు. గరుడపురాణం, కథోపనిషత్తుల ప్రకారం మనిషి మరణించే సమయంలో వారి ప్రాణాలను తీసుకుని పోవడానికి యమధూతలు వస్తారు. వ్యక్తి ఆత్మను యమధూతలు తీసుకుపోయే సమయంలో ఆత్మ భయం కారణంగా శరీరం దిగువభాగం జారుతుంది. ఈ పరిస్థుతుల్లో భయం కారణంగా మలం, మూత్రం బయటకు వస్తుంది. దీనికి విరుద్ధంగా ఆత్మలు బయటకు వస్తాయి. ఈ విధంగా జరగకూడదు. మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోరో వారు స్వర్గానికి వెళ్తారు.

వ్యక్తుల ఆఖరు క్షణాల్లో వారు కళ్లు మూసుకుపోవడం లేదా ఏమి కనిపించకపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి సమయంలో వారికి నలుపురంగు దుస్తుల్లో వచ్చిన యమధూతలు మినహా మరేమి కనిపించవని నమ్ముతారు. అయితే సత్పురుషులు, జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసినవారికి మాత్రం ఈ విధంగా జరుగదు. వీరి చివరి క్షణాల్లో పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవ ధూతలు కనిపిస్తారు. ఆ దేవ ధూతలు వీరిని స్వర్గానికి తీసుకుని వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: