ఆధ్యాత్మికం: పూజ చేసే పద్దతి ఇదే..?
పూజా సమయంలో మన మనస్సు దేవుని పై నిమగ్నం చేయాలి వేరే ఏ ఆలోచనలు రానివ్వరాదు. మనం పూజ చేసే సమయంలో చేతులు, కాళ్ళు, ముఖ్యంగా మనస్సును మన అదుపులో ఉంచుకోవాలి.ఇతరుల పట్ల దయ, సానుభూతి, స్నేహ భావం లేని వారు దేవుడికి ఎన్ని పూజలు చేసినా ఎంత ఖర్చు చేసి యజ్ఞాలు చేసినా వ్యర్ధమే అవుతుంది. అటువంటి దయాహీనులైన వారి పూజలను దేవుడు స్వీకరించడు. అటువంటి వారికి పూజా ఫలం దక్కదు. కష్టాల్లో ఉన్న వారికి చేసే సహాయం మనకు వందరెట్ల పూజా ఫలాన్ని ఇస్తుంది. దేవుడి యొక్క అనుగ్రహం అటువంటి వారిపై నిరంతరం ఉంటుంది.
దేవునికి కావలసింది భాహ్య ఆర్బాటం కాదు. అంతరంగిక ఆర్భాటం... మనసు నిర్మలంగా ఉంచుకొని చేసే పూజ ఆ దేవుడి కృప ని పొంది మంచి ఫలితాన్ని అందిస్తుంది. అంతే కాకుండా సంధ్యా సమయంలో చేసే పూజ పుణ్యాలను చేకూరుస్తుంది. సాయంకాలం పూట దీపారాధన ఖచ్చితంగా చేయాలి. చీకట్లు కమ్ముకునే సమయాన ఇంట్లో దీపం వెలిగించడం మంచిది. ఈ విధంగా మీరు పూజ చేయడం వలన భగవంతుడు మీరు కోరిన వరాలను తీరుస్తాడు. మరియు మీ కుటుంబం ఎప్పుడూ సుఖసంతోషాలతో జీవిస్తారు.