బక్రీద్ రోజున మరణించిన పెద్దలకు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా ?

VAMSI
సంప్రదాయాల ప్రకారం మతం మతానికి కొన్ని పండుగలు ఉన్నాయి. ఈ పండుగలను వారి పద్దతులను బట్టి జరుపుకుంటూ ఉంటారు. ముస్లిము మతానికి చెందిన ఒక పండుగ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. రేపు మరియు పక్క రోజు రెండు రోజులు 'బక్రీద్' అనే పండుగ రానుంది. ముస్లిములకు బక్రీదు పండగ ఎంతో విశిష్టమైనది మరియు ప్రత్యేకమైనది. బక్రీద్ అనగా బకర్ ఈద్ అని అర్దము. వీరు విశ్వసించే మహమ్మదీయ క్యాలెండర్ ని బట్టి ఈ పండుగ జిల్ హజ్ నెలలోనే వస్తుందని తెలుస్తోంది. పవిత్రమైన త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటారు. బక్రీద్ పండుగ రోజున ఖుర్బానీ ఇవ్వడం ముస్లిములు ఎప్పటినుండో ఆచరిస్తున్న సంప్రదాయం. గొర్రె పొట్టేలు మాంసమును మూడు భాగములుగా విభజించి అందులో ఒక భాగమును పేదలకు పంచి పెడతారు.

ఇది వారి పండుగ సంప్రదాయంలో ఒకటి. ఇలా చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని వారి యొక్క విశ్వాసం. ఈ ఏడాది 2021 సంవత్సరంములో జులై 20 మరియు 21వ తేదీన వచ్చినది.  బక్రీద్ పండుగ రోజున చాలా మంది ముస్లిములు మరణించిన వారి పెద్దల సమాదుల వద్దకు వెళ్ళి ప్రత్యేక ప్రార్దనలు జరుపుతారు. అలా చేయడం వలన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం. ముఖ్యంగా వారి సమాధుల దగ్గర వారికీ ఎంతో ఇష్టమైన బట్టలు మరియు ఆహార పదార్దాలను ఉంచి ప్రార్ధనలు చేయడం వారి ఆచారం. ఈ విధంగా చేయడం మూలాన చనిపోయిన వారి పెద్దలకు ఇవి అందుతాయని వారి నమ్మకం.

 అయితే ప్రతి ఒక్క మతంలో ఎవరికి వారి సంప్రదాయాలు ఉంటాయి. మత గురువుల ఆదేశాల ప్రకారం వారు వివిధ రకాల పద్దతులను ఆచరిస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున సత్యం కోసమే ప్రతి ఒక్కటీ త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఇందులో వార్తికి ప్రవక్త హజరత్ ఇబ్రహీం స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఇలా ఎన్నో విషయాలు బక్రీద్ గురించి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: