అయోధ్య అక్షింతలు మిగిలి పోయాయా..? వాటిని ఏమి చేస్తే మంచిదంటే..!
అయోధ్య నుంచి పంపించిన అక్షింతలను ప్రతి ఒక్కరు ఎంతో గొప్ప వరంగా భావించి,తమ పూజ గదుల్లో ఉంచి పూజించారు.జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగగానే,ప్రతి ఒక్కరూ రామునికి పూజలను అందించి అక్షింతలను తలపై వేసుకొని రాముని యొక్క కృపకు లోనయ్యారు.కానీ అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షింతలు కొన్ని మిగిలిపోయి ఉంటాయి.అలా మిగిలిన అక్షింతలను ఏం చేయాలో, ఏమి చేస్తే మంచి జరుగుతుందోనని తెగ ఆలోచిస్తున్నారు.అలాంటి వారందరికీ వేద పండితులు కొన్ని సందర్భాలలో అక్షింతలు ఉపయోగించడం వల్ల రాముని యొక్క ఆశీర్వాదం కలుగుతుందని సూచించారు.అవేంటో మనము తెలుసుకుందాం పదండి..
ఇలా వచ్చిన అయోధ్య అక్షింతలకు ఇంట్లో వాడే సాధారణ అక్షింతలతో కలిపి దేవుడి మందిరంలో కానీ, డబ్బులను ఉంచే బీరువా వంటి ప్రదేశాల్లో కానీ ఉంచాలి. వాటికి ఎలాంటి దోషాలు తాకకుండా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.ఈ అక్షింతలను పెద్దలు ఆశీర్వాదం కోసం వచ్చిన,పిల్లలను ఆశీర్వదించేటప్పుడు రామ మందిర అక్షింతలతో ఆశీర్వదిస్తే,వారిలో పురోభివృద్ధి జరుగుతుందని,మరియు వారికి మంచి జరుగుతుందని తెలిపారు.మరియు పుట్టిన రోజులు,పెళ్లి రోజు,ఇతర శుభకార్యాలకు,ఏదైనా పెద్ద కార్యం తలపెట్టినప్పుడు,ఉద్యోగ ప్రమోషన్ వంటి సందర్భాల్లో శ్రీరాముని తలుచుకొని వేసుకోవడంతో వారు అనుకున్న పనులు సజావుగా జరుగుతాయని సూచించారు.
మీ ఇంట్లో కూడా తప్పకుండా అయోధ్య అక్షింతలు మిగిలే ఉంటాయి.మీరు కూడా ఇలాగే చేసి రాముని యొక్క కృపకు లోనుకండి.