పద్మభూషణ్ కోసం ఇంకా ఏం చేయాలి..!

shami
కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన పద్మ అవార్డులతో కొత్త సమస్య వచ్చి పడింది. ప్రతిభ కనబరుస్తున్నా సరే తమని గుర్తించట్లేదని కొందరు క్రీడాకారులు బాధపడుతున్నారు. ఇక తను ఏం చేస్తే పద్మ భూషణ్ వస్తుందంటూ ఏకంగా కేంద్ర క్రీడల మంత్రికే ట్వీట్ చేశాడు క్యూయిస్ట్ పంకజ్ అడ్వాణి.


ఇప్పటిదాకా తను 16 ప్రపంచ టైటిల్స్.. ఆసియా క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించినా సరే తనకు పద్మభూషణ్ ఇవ్వట్లేదని తన బాధ వెల్లగక్కాడు అడ్వాణి. 2009లో పద్మ శ్రీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ తనకు ఏం చేస్తే పద్మ భూషణ్ ఇస్తుదని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం తరపునుండి పద్మ భూషణ్ అవార్డుకు ప్రతిపాదించింది. కాని కేంద్రం మాత్రం అడ్వాణికి అవార్డ్ ఇవ్వలేదు. ఈసారి క్రీడాకారులెవ్వరికి పద్మ భూషణ్ అవార్డ్ దక్కకపోవడం విశేషం.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: