టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి- వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు. విరాట్ కోహ్లీ పరుగుల దాహం ఇప్పట్లో తీరేలా లేదు. ఓ యంత్రంలా దూసుకుపోతున్నాడు. ఇటీవలే కోహ్లీ వన్డేల్లో 43 సెంచరీలు కంప్లీట్ చేసుకుని సెంచరీల పరంగా సచిన్ రికార్డు బ్రేక్ చేసేలా దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ ఇప్పుడు సచిన్ - గంగూలి రికార్డుకు చెక్ పెట్టేశాడు.
టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లి-రహానేలు నిలిచారు. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్లో కోహ్లి-రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సరికి ఈ జోడీ 104 పరుగులు జోడీంచారు.
ఈ క్రమంలోనే ఈ జోడీ భారత దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ-సచిన్ టెండూల్కర్ల రికార్డును కోహ్లి-రహానేలు బ్రేక్ చేశారు. నాల్గో వికెట్కు గంగూలీ-సచిన్లు ఏడుసార్లు సెంచరీ భాగస్వామ్యాల్ని సాధించగా, కోహ్లి-రహానేలు దాన్ని సవరిస్తూ ఎనిమిదో సారి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
ఇక ఇండియన్ టీంలో టెస్ట్ మ్యాచ్లలో నాల్గో వికెట్కు ఎక్కువ సెంచరీ భాగస్వామ్యాలు చూస్తే తొలి రెండు స్థానాల్లో కోహ్లి-రహానే, గంగూలీ-సచిన్ల జోడి ఉండగా, ఆపై మూడో స్థానంలో మహ్మద్ అజహరుద్దీన్-సచిన్ల జోడి(ఆరుసార్లు) ఉంది.