కోహ్లీ కెప్టెన్సీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్
టీ 20 ల్లో రోహిత్ శర్మ ను కెప్టెన్ గా నియమించాలి. అందుకు రోహిత్ అర్హుడు అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో నాలుగు సార్లు ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు .. కోహ్లీ మాత్రం ఆలీగ్ లో దారుణంగా ప్లాప్ అయ్యాడు. అందుచేత టీ 20ల్లో రోహిత్ ను కెప్టెన్ గా ఉంచితే జట్టకు మేలు జరుగుతుంది. టీ 20ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతున్నందున మేనేజ్ మెంట్ ఈ విషయం గురించి ఆలోచించి రోహిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని యువరాజ్ పేర్కొన్నాడు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటన సమయంలోనే కోహ్లీ కి రెస్ట్ ఇచ్చి రోహిత్ ను కెప్టెన్ చేయాలని మేనేజ్ మెంట్ భావించింది. కానీ చివరి నిమిషంలో నేను ఆడుతాను అని జట్టుతో చేరి రోహిత్ కు కెప్టెన్సీ దక్కకుండా చేశాడు కోహ్లీ.