మరో ఫైట్ కు రెడీ అయిన టీమిండియా

NAGARJUNA NAKKA
వైజాగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఫ్రీడం సిరీస్‌పై కన్నేసింది. పుణె వేదికగా రేపటి నుంచి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌ కోసం కోహ్లీసేన రెడీ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ ఎగరేసుకుపోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ టెస్ట్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని సఫారీ టీమ్‌ పట్టుదలగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్‌ టేబుల్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా మరో ఫైట్‌కి రెడీ అయింది. ఫ్రీడమ్‌ సిరీస్‌లో మొదటి టెస్ట్‌లో అలవోకగా విక్టరీ కొట్టిన కోహ్లీ సేన.. రెండో మ్యాచ్‌కి సిద్దమైంది. సఫారీ టీమ్‌ సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ నిలవాలన్న కసితో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ టీమిండియాకిది రెండో టెస్ట్‌. 2017లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగడంతో.. {{RelevantDataTitle}}