సోషల్ మీడియాపై ఫైర్
భారత కోచ్ రవిశాస్త్రి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు , భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తనకు ఎంతో గౌరవముందని అన్నారు. సౌరవ్ గంగూలీపై నాకున్న గౌరవాన్ని అర్థం చేసుకోలేని వారంత నా దృష్టిలో మూర్ఖులు అని, వారి అభిప్రాయాన్ని తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా, మీడియాలో తామిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తలు అన్ని తప్పు అవన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. ‘శాస్త్రి–గంగూలీకి చెందిన ఏ విషయమైనా మీడియాకు మాంచి మసాలాతో కూడిన భేల్పూరి, చాట్లాంటి వార్తలా అనిపిస్తోంది.
మీడియా మాపై వచ్చే ఊహాగానాలకు విపరీతంగా స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో పని పాట లేనివారే సోషల్ విపరీత వ్యాఖ్యలు చేస్తారు. కానీ నిజానికి ఇందులో వాస్తవం లేదు.ఐన క్రికెట్కు గంగూలీ ఎంతో చేశాడు. అతనంటే నాకు చాలా ఇష్టం గౌరవం. గంగూలీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్ గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో మళ్లీ భారత క్రికెట్లో పునరుజ్జీవం నింపాడు. మా ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉంది. ఈ విషయం అర్థం చేసుకోలేని వారంత మూర్ఖులు ఐన వారి గురించి నేను ఆలోచించను’ అని రవిశాస్త్రి వివరించారు.
గంగూలీ వారం క్రితం కూడా ఇదే అంశంపై స్పష్టతనిచ్చాడు. ఆయన ఊహాగానాలు, కల్పిత వార్తలు నమ్మొద్దని తెలిపాడు.రవిశాస్త్రి బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా ఎన్నికవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అంతేకాదు భారత కోచ్ పదవి ఒత్తిడితో కూడినదని అన్నారు.
ప్రారంభంలో భారత జట్టు నంబర్వన్గా ఎదుగుతుందని తానంటే అందరూ వింతగా చూశారని, కానీ ఇప్పుడు అదే నిజమైంది అని కోచ్గా తన పనితీరుని విమర్శిస్తున్న వారికి సమాధానంగా చెప్పారు. టి20 ప్రపంచకప్లో రిషభ్ పంత్తో పాటు కేఎల్ రాహుల్ను కూడా వికెట్ కీపర్గా పరీక్షిస్తామని అన్నారు.