రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును పాకిస్థాన్ కు రావాల్సిందిగా పీసీబీ ఇటీవల ఆహ్వానించింది. అయితే దీనిపై cricket BOARD' target='_blank' title='బీసీబీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బీసీబీ ఎటు తేల్చుకోలేపోతుంది. పీసీబీ కోరిక మేరకు బంగ్లాదేశ్ ఈనెల చివర్లో పాకిస్థాన్ లో పర్యటించాల్సి వుంది. కానీ బంగ్లా ఆటగాళ్లను ఒప్పించడానికి cricket BOARD' target='_blank' title='బీసీబీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బీసీబీ నానా తంటాలు పడుతుంది.
మరోవైపు బంగ్లా స్టార్ క్రికెటర్ ముష్ ఫికర్ రహీమ్ అయితే నేను పాకిస్థాన్ కు రానని తేల్చి చెప్పాడట దానికి తోడు మిగితా ఆటగాళ్లు కూడా షార్ట్ టూర్ అయితేనే వస్తామని అంటున్నారని cricket BOARD' target='_blank' title='బీసీబీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బీసీబీ అధ్యక్షడు నజీముల్ హాసన్ వెల్లడించాడు. అంటే టెస్టులకు బదులు టీ 20 సిరీస్ ఆడడానికి బంగ్లా క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను నిర్వహించడానికి కూడా పీసీబీ సుముఖంగా వుంది. రేపటి లోగా పాక్ పర్యటన పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు వున్నాయి. ఇక రహీమ్ ,పాక్ పర్యటనకు నో చెప్పడంతో కేవలం పీఎస్ఎల్ లో తీసుకోనందుకే అతను ఈనిర్ణయం తీసుకున్నాడని ట్రోల్ చేస్తున్నారు పాక్ క్రికెట్ అభిమానులు.