2019 ప్రపంచ కప్ తరువాత టీమిండియా కెప్టెన్ కోహ్లీ ,స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ల మధ్య విబేధాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆసమయం లో అందుకు తగ్గట్లే వారి ప్రవర్తన ఉండడంతో విభేదాలు ఉన్నాయని చాలా మంది అనుకున్నారు. అయితే ఆతరువాత ఇద్దరు రికార్డులు సృష్టించడంలో బిజీ కావడం తో ఈగొడవల విషయం మరుగున పడిపోయింది. కోహ్లీ మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా రోహిత్ కు తనకు ఎలాంటి గొడవలు లేవని సంకేతాలు ఇస్తూ వస్తున్నాడు.
ఇక తాజాగా కోహ్లీ ,రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించాడు. పూణే లో శుక్రవారం శ్రీలంక తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈ కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించాం. మా ప్రదర్శన పట్ల చాలా ఆనందం గా వుంది ఇక ముందు మ్యాచ్ ల్లో కూడా ఇదే ఫలితాలను రిపీట్ చేయాలనుకుంటున్నాం. సీనియర్ ఆటగాళ్లు విఫలమైతే యువ ఆటగాళ్లు అండగా నిలుస్తున్నారు. ఓపెనర్లు రోహిత్ , ధావన్ , రాహుల్ ముగ్గురు సాలిడ్ ప్లేయర్స్ .. రోహిత్ నిలకడ గల ఆటగాడు జనాలు మా మధ్య వ్యతిరేకత ఉందని పుకార్లు సృష్టించడం ఆపాలని నేను వాటిని నమ్మనని ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యానించాడు.