హామిల్టన్ లో ఆతిథ్య న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఈమ్యాచ్ లో మొదట భారత్ బ్యాటింగ్ కు దిగగా.. బెన్నెట్ వేసిన 6ఓవర్ లో చివరి 5బంతులను 6,6,4,4,6 గా తరలించి కేవలం 23బంతుల్లోనే రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ 20ల్లో అతి తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేయడం రోహిత్ కు ఇది నాల్గో సారి. ఇంతకుముందు వెస్టిండీస్ పై 22బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా ఆతరువాత బంగ్లాదేశ్ అలాగే విండీస్ లపై 23బంతుల్లో అర్ద శతకాలు సాధించాడు.
ఇక మూడో టీ 20లో రోహిత్ చెలరేగుతుండగా అద్భుత ఫామ్ లో వున్న మరో ఓపెనర్ రాహుల్ 27 పరుగులు చేసి పెవీలియన్ చేరుకున్నాడు. మూడో స్థానం లో కోహ్లీ బదులు ఆల్ రౌండర్ శివమ్ దూబే బ్యాటింగ్ కు వచ్చాడు. ప్రస్తుతం భారత్ 10 ఓవర్ల లో వికెట్ నష్టానికి 92పరుగులు చేసింది. 5మ్యాచ్ ల టీ 20సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లను గెలవడంతో ఈమ్యాచ్ లో విజయం సాధిస్తే 3-0 తో సిరీస్ ను కైవసం చేసుకోనుంది.