కాసులు కురిపించే పొట్టి క్రికెట్ లీగ్.. ఐపిఎల్ 2020 సీజన్ షెడ్యూల్ ను బీసీసీఐ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. 57రోజుల పాటు జరుగనున్న ఐపీఎల్ 13 లో ఈసారి మధ్యాహ్నం కేవలం 6మ్యాచ్ లు మాత్రమే జరుగనున్నాయి. అవి కూడా ఆదివారాలు మాత్రమే రెండు మ్యాచ్ లు జరుగుతాయి శనివారాలు కేవలం ఒక మ్యాచ్చే జరుగనుంది. ఇక మార్చి 29న ముంబై లోని వాంఖడే స్టేడియం లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ,గత సీజన్ రన్నర్ అప్ చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య మొదటి మ్యాచ్ జరునుండగా ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియం లో మే 24న జరుగనుంది.
ఇదిలా ఉంటే ఐపిఎల్ ప్రారంభమయ్యే మూడు రోజుల ముందు అనగా మార్చి 25 న వాంఖడే మైదానం లో ఆల్ స్టార్స్ పేరిట చారిటీ మ్యాచ్ జరుగనుంది. ఈమ్యాచ్ లో ఐపీఎల్ జట్లలోని స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందుకోసం చెన్నై ,బెంగళూరు , హైదరాబాద్, ముంబై అలాగే రాజస్థాన్ , ఢిల్లీ , పంజాబ్ ,కోల్ కత్తా రెండు టీంలు గా విడిపోనున్నాయి.