రికార్డుల రారాజు మన జూనియర్ ద్రావిడ్.... బ్యాటింగ్ & బౌలింగ్లో విధ్వంసమే...!
ఈ మ్యాచ్లో సమిత్ బ్యాటింగ్లో సెంచరీ బాదడంతో పాటు బౌలింగ్లోనూ రాణించి నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన మాల్యా జట్టు 50 ఓవర్లలో 330 పరుగులు చేసింది. ఇందులో సగం రన్స్ సమిత్ ద్రావిడ్ ఒక్కడే చేశాడు. 131 బంతుల్లో 24 బౌండరీలతో 166 పరుగులు చేశాడు. తోటి ప్లేయర్ అన్వయ్ 90 పరుగులతో అతడికి అండగా నిలిచాడు.
331 పరుగులతో బ్యాటింగ్ చేపట్టిన విద్యా షిల్ప్ అకాడమీ జట్టు 38.5 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌట్ అయింది. సమిత్ కేవలం 35 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో విజయంతో మాల్యా స్కూల్ జట్టు సెమీ ఫైనల్కు చేరింది. ఇక ఇదే టోర్నీలో గతంలో జరిగిన మ్యాచ్లో సమిత్ ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. శ్రీకుమరన్ జట్టుపై 33 బౌండరీలతో 204 రన్స్ చేశాడు.