ఆసియా కప్ పాకిస్థాన్ లో కాదు..
ఈఏడాది సెప్టెంబర్ లో జరుగనున్న ఆసియా కప్ వేదిక మారింది. పాకిస్థాన్ ఈ టోర్నీ నిర్వాహణ హక్కులు పొందింది అయితే టీమిండియా ను భద్రతా కారణాల దృష్ట్యా పాక్ కు పంపడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు దాంతో ఆసియా కప్ ను దుబాయ్ లో నిర్వహించడానికి పాకిస్థాన్ ఓకే చెప్పింది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఈ వార్తలను ధ్రువీకరించాడు. వచ్చే నెల 3న జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం లో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లే ముందు గంగూలీ మీడియాతో మాట్లాడాడు. ఆసియా కప్ దుబాయ్ లో జరుగనుంది ఈ టోర్నీ లో భారత్ , పాకిస్థాన్ లు కూడా పాల్గొంటాయని గంగూలీ వెల్లడించాడు.