మన మహేంద్రుడికి మరీ ఇంత క్రేజా...? ధోనీ రీఎంట్రీకి పాక్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూపు....!!

Kothuru Ram Kumar

టీమిండియా క్రికెట్ మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీ రీఎంట్రీ కోసం నిజానికి భారత్ అభిమానులే కాదు, పాకిస్థాన్ లోని ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పూర్తిగా కళ్లకి కనిపిస్తోంది. ఐపీఎల్  లాగే పాకిస్థాన్ గడ్డపై జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (PSL)లో ఒక మ్యాచ్‌ ని చూడడానికి స్టేడియానికి వచ్చిన అభిమాని జెర్సీ చూసి అందరూ నోర్లెళ్ళబెట్టారు. అతను పాకిస్థాన్ జాతీయ జట్టు జెర్సీని ధరించి.. జెర్సీ వెనుక ధోనీ పేరు, జెర్సీ నెం.7 ని అచ్చు వేసి ఉంది. 

 


దీనితో స్టేడియంలో అతను ఒకింత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సోషల్ మీడియాలో మాత్రం అతను పోస్ట్ చేసిన ఫొటో‌కి చెప్పలేనంత స్పందన వచ్చింది. నిజానికి ఆ పాకిస్థాన్ అభిమాని, పీఎస్‌ఎల్‌ లో ఆడుతున్న ఇస్లామాబాద్ యునైటెడ్ టీంకి మద్దతు తెలిపేందుకు స్టేడియంకి వచ్చాడు. కాకాపోతే  ధోనీ పేరు, నెంబరు ఉన్న జెర్సీ ధరించి.. భారత మాజీ కెప్టెన్‌పై అభిమానాన్ని చాటాడు. అయితే ఇప్పటికే ఐపీఎల్ 2020 సీజన్‌ తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికోసం ఇప్పటికే చెన్నై చేరుకున్న ధోనీ చెపాక్ స్టేడియంలో సహచరులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: