ఐపీఎల్ : ఆ ఇద్దరు ఆటగాళ్ళు నమ్మకాన్ని కలిగించారబ్బా.. ఫాన్స్ లో ధీమా..?

praveen
గత సీజన్లో కేన్ విలియమ్సన్ సారధ్యంలో ముందుకు సాగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి జట్టుకు టైటిల్ అందించిన వార్నర్ సారథ్యం లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సారి మళ్ళీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తప్పక టైటిల్ గెలిచి తీరుతుంది అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే టైటిల్ ఫేవరెట్గా 2020 ఐపీఎల్ సీజన్ లో రంగంలోకి దిగింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ మొదటి నుంచి ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ముఖ్యంగా ఛేదనలో ప్రతి సారి కూడా బోల్తా పడుతూ వచ్చింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు .

 అయితే ఇప్పుడు వరకు 9 మ్యాచ్లు ఆడిన జట్టు కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సన్రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ప్రతి మ్యాచ్ కూడా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే నిన్న రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతో అద్భుతంగా ఆధిపత్యం సాధించింది అని చెప్పాలి.

 నిన్నటి మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించి పాయింట్ల పట్టిక లో 5వ స్థానానికి చేరుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే కేవలం ఇద్దరు ఓపెనర్ల పైన ఆధార పడుతూ వచ్చింది జట్టు. కానీ నిన్న ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయ్యి అభిమానుల ఆశలు సన్నగిల్లుతున్న వేళ క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే విజయ శంకరులు అభిమానుల్లో కొత్త ఊపిరులు నింపారు. ఇక రాబోయే మ్యాచ్లో ఓపెనర్లు విఫలం అయినప్పటికీ మిడిల్ ఆర్డర్  మాత్రం అద్భుతంగా రాణించి జట్టు విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు ఆ ఇద్దరు ఆటగాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: