కోహ్లీ ని జట్టు నుంచి పక్కన పెట్టిన ఆర్సిబి మాజీ కోచ్..?

praveen
ఐపీఎల్ టోర్నీలో ఎంతో మంది విదేశీ ఆటగాళ్లతో పాటు స్వదేశీ ఆటగాళ్లు కూడా అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రేక్షకులందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఐపీఎల్ ఒక మంచి ఫ్లాట్ఫామ్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రదర్శన తర్వాత ఎంతో మంది మాజీ క్రికెటర్లు తమ ఫేవరేట్ స్వదేశీ విదేశీ ఆటగాళ్లతో కూడిన తమ ఫేవరెట్ జట్టును ప్రకటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అద్భుత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లలో తమకు నచ్చిన ఆటగాళ్లను సెలెక్ట్ చేసి ఒక జట్టును రూపొందిస్తూ ఉంటారు ఇక ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా  తన జట్టును ప్రకటించాడు.



 ఆశిష్ నెహ్రా ప్రకటించిన జట్టు ను చూసి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే... ఏకంగా తన జట్టులో విరాట్ కోహ్లీకి స్థానం కల్పించకుండా పక్కనపెట్టాడు ఆశిష్ నెహ్రా. విరాట్ కోహ్లీ స్థానంలో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కి అవకాశం కల్పించాడు. కేఎల్ రాహుల్ డేవిడ్ వార్నర్ లను  తన జట్టుకు ఓపెనర్లు గా ఎంపిక చేసిన ఆశిష్ నెహ్రా.. మూడవ స్థానంలో కోహ్లీ కి బదులు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక చేసాడు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.



 గతంలో ఆర్సిబి బౌలింగ్ కోచ్గా పనిచేసిన.. ఆశిష్ నెహ్రా వేగంగా తన ఫేవరెట్ జట్టులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కీ  స్థానం కల్పించకపోవడం తో అటు అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇక అదే సమయంలో తన జట్టు లో నాల్గవ స్థానంలో ఏబీ డివిలియర్స్... ఐదవ స్థానంలో ఇషాన్ కిషన్ ఆరవ స్థానంలో హార్దిక్ పాండ్యా.. బ్యాట్స్మెన్లను ఎంపిక చేశాడు ఇక టోర్నమెంట్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచిన జొఫ్రా  ఆర్చర్  తో పాటు రషీద్ ఖాన్ కి కూడా తన జట్టులో స్థానం కల్పించాడు ఆశిష్ నెహ్రా. ఏదేమైనా ఆశిష్ నెహ్రా తన జట్టులో విరాట్ కోహ్లీ కి స్థానం కల్పించకపోవడం మాత్రమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: