ధోని కి అంత సీన్ లేదు.. ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్..?

praveen
భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాడు మహేంద్రసింగ్ ధోని. ఎలాంటి ఒత్తిడిలో అయినా ఎంతో కూల్ గా ఆలోచిస్తూ దిగ్గజ ఆటగాడు గా ఎదిగాడు. భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ ఒక ప్రత్యేక అధ్యాయం అన్న విషయం తెలిసిందే. మహేంద్రసింగ్ ధోని పై ఎప్పుడూ భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా తన అక్కసును వెళ్లగక్కుతూ ఉంటాడు.


 ఇక ఇప్పుడు మరో సారి ఆకాష్  చోప్రా  మహేంద్ర సింగ్ ధోనీపై తన అక్కసు వెళ్లగక్కాడు.  ఐసీసీ డికెట్  అవార్డ్స్ ప్రకటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల దశాబ్దాల్లో  ఐసిసి టి20 జట్టును ప్రకటించింది.  ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం ఇచ్చింది. వికెట్ కీపర్ గా నే కాకుండా కెప్టెన్ గా కూడా చోటు వచ్చింది ఐసీసీ. దీంతో ధోనీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ధోని కి ఇంత గౌరవం ఇచ్చిన ఐసీసీ కి కృతజ్ఞతలు తెలిపారు అభిమానులు.



 అయితే దీనిపై ఆకాష్ చోప్రా  మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని ఈ దశాబ్దంలో టీ-20లో చేసింది ఏమీ లేదని విమర్శలకు దిగాడు ఆకాశ్ చోప్రా. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కి ధోని కి ఇచ్చిన స్థానం కల్పించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  అయితే ప్రస్తుతం ఆకాష్  చోప్రా  వ్యాఖ్యలపై ధోని అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియావేదికగా ఆకాశ్ చోప్రా ను  టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వాస్తవంగా అయితే ధోని పై  ఆకాశ్ చోప్రా ఇలా నోరు జారితూ  విమర్శలు చేస్తూ ఉండడం తరచూ జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: