హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తొలిరోజు ఆట పూర్తిగా వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు నిజమవడంతో
టాస్ కూడా పడకుండానే తొలి రోజు ఆవిరైంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు డబ్ల్యూటీసీ ఫైనల్ మీద రకరకాల మీమ్స్తో ఐసీసీ, భారత సారథి విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ట్రోల్ చేస్తున్నా
రు.
ఫేస్బుక్లో అయితే ఒక అభిమాని వేటగాడులోని ఆకు చాటు పిందె తడిసే పాటను మ్యాట్ చాటు పిచ్ తడిసే.. బ్యాట్ తోటి బంతి తడిసే.. ఆకాశ గంగొచ్చింది.. మ్యాచంతా తుడిచేసిందంటూ చేసిన స్పూఫ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ట్విటర్లో అయితే ఒక అభిమాని సముద్రం లోపల విలియమ్సన్ బ్యాటింగ్, రిషభ్ పంత్ కీపింగ్ చేస్తున్నట్టు తయారు చేసిన మీమ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. జోరు వర్షంలో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో చూడండి అంటూ మరో అభిమాని ఒక వీడియో షేర్ చేశాడు. అందులో బౌలింగ్ ఎండ్లోని బ్యాట్స్ మన్ పరిగెడుతూ జారిపడగా కీపింగ్ చేస్తున్న కీపర్ అయితే బంతిని అందుకునే క్రమంలో వికెట్ల మీద పడతాడు.
మరొక అభిమానైతే సముద్రం ఒడ్డు దగ్గర డబ్ల్యూటీఏ ఫైనల్ జరుగుతున్నట్టు చేసిన మీమ్ అయితే ట్విటర్లో తెగా వైరల్ అవుతుంది. ఇలా ఒకటా.. రెండా.. తోలి రోజు ఆట వర్షంతో తుడిచిపెట్టుకుపోవడంతో అభిమానులు రకరకాల మీమ్స్తో సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు. ట్విటర్, ఫేస్బుక్లో బాగా వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్, స్పూఫ్ వీడియోలు ఈ కింద చూడవచ్చు. ఇక, తాజా సమాచారం ప్రకారం సౌతాంప్టన్ లో వరుణుడు శాంతించడంతో గ్రౌండ్స్ మెన్ స్టేడియం అవుట్ ఫీల్డ్ ను శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.