జడేజా ఎంపీకే బెడిసికొట్టింది.. మరోసారి గెలికిన మంజ్రేకర్?

praveen
ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకం గా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓడి పోయింది. హాట్ ఫేవరెట్గా ఉన్న భారత జట్టుపై న్యూజిలాండ్ జట్టు అలవోకగా విజయం సాధించింది. దీంతో కోహ్లీ కెప్టెన్సీపై జట్టు ఎంపిక పై కూడా తీవ్ర స్థాయి లో విమర్శలు వస్తున్నాయ్.  ముఖ్యం గా ఇద్దరు స్పిన్నర్లను పెట్టుకొని కోహ్లీ రంగం లోకి దిగడం ఏంటి అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా బ్యాటింగ్ లో తేలిపోయిన భారత జట్టు న్యూజిలాండ్ జట్టు చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడి పోయింది.



 అయితే అక్కడ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది అని తెలిసినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం ఇద్దరు స్పిన్నర్లతో ఉన్న జట్టు తో రంగంలోకి దిగారు. ఇక జట్టు ఎంపిక పై మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారత తుది జట్టు ఎంపిక పై మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ కి ముందే స్పిన్నర్ లను జట్టులోకి తీసుకోవడం పై తీవ్రమైన చర్చ జరిగింది. తొలిరోజు వర్షం కారణంగా కనీసం టాస్ కూడా సాధ్యం కాలేదు. తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుగుణం గా జట్టులో ఒక స్పిన్నర్ ఉంటే చాలు అని సూచించారు.



ఈక్రమంలోనే రవీంద్ర జడేజా ను బ్యాటింగ్ కోణం లో ఎంచుకున్నారు తప్ప ఎడమ చేతివాటం బౌలింగ్ కోసం కాదు.. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ జడేజా తో టీమిండియా రంగం లోకి దిగింది. హనుమ విహారి ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బాగా రాణించేది అంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు.  2019 వరల్డ్ కప్ సమయంలోనే మంజ్రేకర్ రవీంద్ర జడేజా మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇటీవలే మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: