భారత రెజ్లర్ కి షాక్.. ఒలంపిక్స్ ముంగిట నిషేధం?
కామన్వెల్త్ గేమ్స్ లో అద్భుతంగా రాణించి భారత్ తరఫున ఛాంపియన్గా నిలిచిన సుమిత్ మాలిక్ ఫై భారత ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తరఫున పథకం సాధిస్తాడు అని అందరూ అనుకున్నారు. 125 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడుతున్నాడు సుమిత్. ఇక ఇటీవల జూన్ నెలలో సోఫియా వేదికగా జరిగిన వరల్డ్ ఒలంపిక్ క్వాలిఫైయర్ లో కూడా అర్హత సాధించాడు. అయితే ఆ సమయంలో నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకొని పోటీపడినట్లు తేలింది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్ కు అర్హత సాధించినప్పటికీ.. ఆ సమయంలో నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది.
ఇటీవల నిర్వహించిన బి షాంపిల్స్ లో కూడా అతను నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అతనికి ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ రెస్లింగ్ యూనియన్ సుమిత్ మాలిక్పై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఘటనతో భారత తరఫున పథకం సాధిస్తాడు అని ఆశలు పెట్టుకున్న ఎంతో మంది ప్రేక్షకుల ఆశలు అడియాశలు గా మారిపోయాయి. 2017లో ఆసియా ఛాంపియన్షిప్ తర్వాత కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో రజక పతకాన్ని గెలుచుకున్నాడు సుమిత్ మాలిక్.కానీ 2018 లో మాత్రం గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత అర్జున అవార్డు సైతం దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం భారత ప్రజానీకానికి నిరాశ మిగిల్చాడు.