'పీవీ సింధు'నే బ్రాండ్ అంబాసిడర్ గా మారనుందా.. ?
ఈ సందర్భంగా మరోసారి తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ క్రీడలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. దాదాపు తెరాస ప్రభుత్వం వచ్చినప్పటి నుండి క్రీడలకు అందిస్తున్న ప్రోత్సాహం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. కేవలం తెలంగాణ క్రీడా శాఖ మంత్రి తమ స్వార్థం కోసమే కృషి చేస్తున్నారని, క్రీడలను అభివృద్ధి చేసే కార్యక్రమాలపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఘాటుగా మాట్లాడారు. ఎంతో మంది క్రీడాకారులు సరైన సౌకర్యాలు మరియు సహకారం లేక ఇబ్బంది పడుతున్నారు. క్రీడా సిబ్బంది సైతం జీతాలు అందక రోడ్లపై నిరసనలు తెలిపే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కన్నా ముందు పాలించిన పార్టీలనే క్రీడలకు తగిన ప్రాధాన్యాన్ని ఇచ్చారని కాంగ్రెస్ మరియు టీడీపీ ప్రభుత్వాలను కొనియాడారు.
ముఖ్యంగా తెలంగాణ క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను ఎలా నియమిస్తారని ప్రశ్నించాడు. సానియా మీర్జా ఇప్పుడు పాకిస్తాన్ దేశానికి కోడలిగా వెళ్లిన తరువాత ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగించడం సబబుగా లేదని అడిగాడు. ఈమెను కాకుండా మన దేశానికి రెండు ఒలింపిక్ పతకాలను సాధించిన పీవీ సింధును బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని గట్టిగా చెప్పారు. ప్రతి ఒక్కరూ పుట్టగానే గొప్ప క్రీడాకారుడు అయిపోరు. అందరూ మారుమూల ప్రాంతం నుండే పుట్టుకొస్తారు, ఎప్పుడైతే అలాంటివారికి ప్రభుత్వాలు సరైన సహకారం సౌకర్యాలు అందిస్తాయో వారే మనదేశానికి గర్వకారణం అవుతారని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ విధంగా వచ్చిన వారే సచిన్ మరియు ధోనీలు అని తెలిపారు. అయితే సానియా మీర్జాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. మరి కేసీఆర్ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.