ధోని వచ్చాడు.. నా పని అయిపోయింది.. స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?
అప్పటివరకు భారత్కు రెగ్యులర్ వికెట్ కీపర్గా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ గా ఉన్న దినేష్ కార్తీక్ ధోని రావడంతో అతని స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి అతని కెరీర్ క కాస్త అయోమయంలో పడిపోయింది. ధోనీ జట్టులోనే ఉండడంతో ఇక వికెట్ కీపర్గా ఎలాంటి అవకాశాలు దక్కలేదు. దీంతో స్పెషలిస్ట్ బ్యాట్మెన్గా దినేష్ కార్తీక్ మారాల్సి వచ్చింది. అంతేకాదు ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో సత్తా చాటుతున్న నేపథ్యంలో ఎన్నో రోజుల నుంచి జట్టుకు దూరంగానే ఉంటున్నాడు దినేష్ కార్తీక్. ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
తనకు అవకాశాలు రాకపోతే నేనెప్పుడూ కుంగిపోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టానని తెలిపాడు. ఒకానొక సమయంలో తన కెరీర్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అవతారం ఎత్తాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ సమయంలో తాను ఒక మంచి ప్రతిభావంతుడని మంచి బ్యాట్స్మెన్ అన్న విషయాన్ని ధోని సహా మరికొంతమంది చెప్పి ప్రోత్సహించారూ అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ధోని చెప్పిన మాటలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి అంటూ తెలిపాడు. ధోని జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఒక తుఫానులా దూసుకు వచ్చాడని ఇక అతని రాక తో తన తలుపులు మూసుకు పోయాయి అని భావించాను అంటూ తెలిపాడు. ధోని లాంటి వాళ్ళు తరానికి ఒక్కడే ఉంటాడు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.