అయ్యబాబోయ్.. ఒక్క సిక్సర్ కి రూ.20 వేలు?
ఎంతో ఉత్కంఠ భరితంగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ లో చివరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. అయితే చివరి అంకం వరకు కూడా అన్ని జట్లు ఎంతో హోరా హోరీ గానే టైటిల్ కోసం పోరాడాయ్ అని చెప్పాలి. ఇక మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్ ఐపీఎల్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఇంతకీ ఇలా ఒక సిక్సర్ కి 20 వేల రూపాయలు ఏంటి అని అంటారా. సాధారణంగా ఐపీఎల్లో సిక్సర్ల వర్షం కురుస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. క్రీజు లోకి వచ్చిన ప్రతి ఆటగాడు కూడా బంతిని బౌండరీ దాటించేందుకు ప్రయత్నిస్తూంటాడు. అయితే ఇటీవలే ఆటగాళ్లు కొట్టిన సిక్సర్ లే ఒక మంచి పనికి ఉపయోగపడుతున్నాయి.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్రధాన స్పాన్సర్గా కొనసాగుతోంది డిహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్. అయితే ఈ సంస్థ ఇప్పుడు ఒక గొప్ప పని చేసేందుకు సిద్ధమైంది. దివ్యాంగ మహిళల క్రికెట్ కు అండగా నిలవాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వినూత్నంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 2021 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టులోని ఆటగాళ్లు కొట్టిన సిక్సర్ లకు అనుగుణంగా సహాయం చేయాలి అని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కొట్టిన ప్రతి సిక్సర్ కి కూడా 20 వేల రూపాయల చొప్పున మహిళల క్రికెట్ కోసం విరాళం ఇవ్వడానికి సిద్ధం అయింది. అయితే 2021 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మొత్తంగా 76 సిక్సర్లు కొట్టారూ. దీన్ని బట్టి చూస్తే 15.20 లక్షల రూపాయలు అవుతుంది. ఇక ఈ మొత్తాన్ని ఇస్తామని డిహెచ్ఎల్ సంస్థ ప్రకటించింది.