శ్రీలంక సెమీస్ ఆశలు గల్లంతు?

VAMSI
ప్రస్తుతం యూఏఈ మరియు ఒమన్ వేదికలుగా జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్ ఉత్కంఠ దశలో ఉంది. రెండు గ్రూప్ లుగా విడిపోయి ఆడుతున్న మ్యాచ్ లలో ఏ నాలుగు జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి అన్న విషయంలో ఒక క్లారిటీ రాలేదు. అయితే ఈ రోజు శ్రీలంకకు మరియు సౌత్ ఆఫ్రికా కు మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 142 పరుగులకు ఆల్ ఔట్ అయింది. శ్రీలంకకు ఇది మూడవ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ కు ముందు వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి ఒకటి ఓడింది. దీనితో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన స్థితిలో మొదటగా శ్రీలంక బ్యాట్స్ మాన్ లు చేతులెత్తేశారు.

ఓపెనర్ పతుం నిస్సంక మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఫామ్ లో ఉన్న అసలంక మరియు రాజపక్సే లు సైతం నిరాశ పరిచారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో  నార్జే , శంశి మరియు ప్రిటోరియస్ లు అధ్బుతమైన బౌలింగ్ కు శ్రీలంక బ్యాట్స్ మాన్ లు విలవిలలాడిపోయారు. ఇక ౧౪౩ పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ నత్త నడకన సాగింది. ఒక దశలో శ్రీలంక గెలిచేలా అనిపించింది. చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన దశలో సీరీజులో ఉన్న మిల్లర్ మరియు రబాడాలపై తీవ్ర ఒత్తిడి పడింది. కానీ 19 వ ఓవర్ లో ఒక సిక్స్ మరియు ఆఖరి ఓవర్ లో రెండు సిక్స్ లు కొట్టడంతో ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా.

అలా వచ్చిన విజయావకాశాన్ని పేలవమైన బౌలింగ్ తో శ్రీలంక దూరం చేసుకుంది. ఈ ఓటమితో ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు ఓటమి చెందడంతో ఇక దాదాపుగా సెమీస్ దారులు మూసుకుపోయినట్టే. గ్రూప్ 1 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా లు సెమీస్ కు అర్హత సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి మధ్యలో వీరిద్దరూ ఓడిపోతే తప్పించి ఇక ఈ గ్రూప్ నుండి మాత్రం వేరే సెమీఫైనలిస్ట్ లు అవుతారు అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: