భారత్ లో అడుగు పెట్టిన పాకిస్తాన్ జట్టు.. ప్రపంచ కప్ కు సిద్ధం?
ఒడిషాలోని భువనేశ్వరి వేదికగా నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జూనియర్ హాకీ ప్రపంచ కప్ జరగబోతుంది. జూనియర్ హాకీ పాకిస్తాన్ జట్టు భారత్లో అడుగు పెట్టగా పాకిస్తాన్ హై కమిషన్ ఇన్ఛార్జ్ అఫ్తాబ్ ఖాన్ జట్టు ఆటగాళ్ళకు ఘన స్వాగతం పలికారు. కాగా డిఫెండింగ్ చాంపియన్ భారత్ నవంబర్ 24వ తేదీన ఫ్రాన్స్ తో ప్రపంచకప్ ప్రారంభించబోతుంది. ఇక ప్రస్తుతం ఇక ఈ ప్రపంచ కప్ లో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. పాకిస్తాన్ జట్టు గ్రూప్ డి లో కొనసాగుతోంది.అయితే ఇలా హాకీ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు వచ్చిన జట్ల ఆటగాళ్లకు 72 గంటలకు ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు తప్పక చేయించుకుంటారని క్రీడా విభాగం అధికారులు తెలుపుతున్నారు.
ఈ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ను ఎంతో సురక్షితంగా జరిపేందుకు తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాట్లు అంటూ అధికారులు చెబుతున్నారు.. వరల్డ్ కప్ లో విజయం సాధించాలని ఒక పెద్ద కలతో ఇక్కడికి వస్తున్న ఎంతోమంది జూనియర్ హాకీ క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము అన్ని ఏర్పాట్లు చేశాము అంటూ చెప్పుకొచ్చారు అధికారులు. అయితే ఇక జూనియర్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా పాకిస్థాన్ జూనియర్ హాకీ జట్టు వేగంగా భారత్లో అడుగు పెట్టడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.