ఐపీఎల్ లో ఆడాలనుకునే కుర్రాళ్లకు ఆఖరి తేదీ?

VAMSI
ఐపీఎల్ చరిత్రలో మొదటి సారిగా 10 టీం లు టైటిల్ కోసం పోరాడ బోతున్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ లో కేవలం 8 టీం లు మాత్రమే పోరాడడం మనము చూశాము. అయితే ఇప్పుడు టీం లు పెరగడంతో పాటుగా మ్యాచ్ ల సంఖ్య కూడా పెరిగి క్రికెట్ వీక్షకులకు ఆనందాన్ని కలిగించనున్నాయి. బీసీసీఐ తర్వాత జరగబోయి సీజన్ కోసం అన్ని విధాలా ఏర్పాట్లను చేస్తోంది. అందులో భాగంగా ఎనిమిది ఫ్రాంచైజీలలో ఆటగాళ్లను కూర్పు చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం 2022 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మెగా వేలం ను జరపనుంది. ఇందులో ఎప్పటి లాగే ఫ్రాంచైజీలకు నచ్చిన వారిని బీసీసీఐ వారికి కేటాయించిన ధరను చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు వెలువడింది. ఫిబ్రవరి 12 మరియు 13 వ తేదీలలో బెంగుళూరు వేదికగా ఈ మెగా వేలం జరగ నుంది. ఇందుకోసం కొన్ని విషయాలను బీసీసీఐ దేశవాళీ బోర్డ్స్, అంతర్జాతీయ బోర్డులకు తెలిపింది. ఎవరైతే ఐపీఎల్ 15 సీజన్ లో ఆడాలని అనుకుంటారో వారు నిర్ణీత గడువు లోపు వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపింది. ఇందు కోసం జనవరి 17 వ తేదీ వరకు సమయాన్ని ఇచ్చింది. ఈ లోపు మాత్రమే ప్రపంచంలో ఉన్న ఏ ప్లేయర్ అయినా ఇక్కడ ఆడేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది ఇప్పుడిప్పుడే తమ టాలెంట్ తో ఆకట్టుకుంటున్న కుర్రాళ్లకు మంచి అవకాశం అని చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని ఎంత మంది వాడుకుంటారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న లీగ్ లలో రాణించిన ఆటగాళ్లకు మంచి ధర పలికే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా  ఎవరెవరు అత్యధిక ధరను పొందుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: