ఐపీఎల్లో కి కొత్త జట్టు.. టైటిల్ రివీల్?

praveen
ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో రసవత్తరంగా మారబోతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్లో రెండు జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో ఎనిమిది జట్లు కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.ఇప్పుడు కొత్తగా లక్నో అహ్మదాబాద్ జట్లు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇక బిసిసిఐ మెగా వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ఈ మెగా వేలం ప్రాసెస్ లో భాగంగా అన్ని జట్లు కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది అంటూ తేల్చి చెప్పింది. దీంతో మొన్నటి వరకు ఎంతో పటిష్టంగా ఉంటాయి అనుకున్న జట్లు సైతం కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే తమతో అంటిపెట్టుకుని మిగతా అందర్నీ కూడా మెగా పొలంలోకి వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.


 దీంతో ఇక ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరగబోయే మెగా వేలంలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అయితే ఇక ఈ సారి ప్రతిభగల ఆటగాళ్ళను జట్టులోకి తీసుకుని టైటిల్ కొట్టాలని ప్రతి ఒక్క జట్టు ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో ఐపీఎల్ లో కొత్తగా ఇస్తున్న రెండు జట్లు ఇక రావడం రావడమే టైటిల్ ఎగరేసుకు పోవాలని ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయ్. అయితే ఇటీవలే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న అహ్మదాబాద్ కు అహ్మదాబాద్ టైటాన్ అనే పేరును ఖరారు చేశారు.



 కానీ ఇప్పుడు మాత్రం ఆ పేరులో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ టైటాన్స్ అనే పేరును గుజరాత్ టైటాన్స్ అని మార్చడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే ఏడాది ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన ఆ సంస్థ 5625 కోట్లకు గుజరాత్ ను సొంతం చేసుకుంది అనే విషయం తెలిసిందే. అంతేకాదు ఇక ఈ జట్టుకు కెప్టెన్గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. దీనికోసం అతనికి 15 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రషీద్ ఖాన్ ను  కూడా అహ్మదాబాద్  సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగా వేలం  తర్వాత దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: