విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్ న్యూస్... ?
అయితే ఇప్పుడు శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్ ల సిరీస్ కోసం మళ్ళీ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. మొదటి టెస్ట్ మొహాలీ వేదికగా మార్చ్ 4 నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. విరాట్ కోహ్లీ కెరీర్ లో ఆడుతున్న 100 వ టెస్ట్ కూడా ఇదే కావడం విశేషం. దీనితో కోహ్లీ అభిమానులు తన నుండి సెంచరీని ఆశిస్తున్నారు. కోహ్లీ కూడా రెండు సంవత్సరాలుగా ఒక్క సెంచరీ కూడా చేసింది లేదు. అయితే ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ కోహ్లీ అభిమానులకు వరంగా మారిందని చెప్పాలి. ఇంతకు ముందు వరకు కరోనా కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించలేదు.
అయితే ఇంతకు ముందు వరకు ప్రేక్షకులను అనుమతించేది లేదని కూడా బీసీసీఐ ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఈ టెస్ట్ కు మాత్రం 50 శాతం ప్రేక్షకులను స్టేడియం లోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రేపటి నుండి ఈ టెస్ట్ కు సంబంధించి టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. మరి ఈ శుభవార్తతో పాటు కోహ్లీ కూడా ఈ టెస్ట్ లో సెంచరీ సాధించి అభిమానులను అలరిస్తాడో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.