ఐపీఎల్.. ఆ జట్టుకు కోచ్ గా మలింగ?

praveen
ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అటు భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ ప్రేక్షకులు అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరిలో మెగా వేలం ప్రక్రియ ముగియగా మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి ఐపీఎల్ లో కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇస్తూ ఉండడం తో ఈసారి ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా మారబోతుంది అన్నది అర్ధమవుతుంది. అంతేకాకుండా ఏ జట్టు ఎలా రాణించ పోతుంది అన్నది కూడా అటు ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంది అని చెప్పాలి.


 అయితే ఇప్పటి వరకు జరిగిన విధంగా కాకుండా సరికొత్త రీతిలో ఐపీఎల్ జరిపేందుకు సిద్దం అయ్యారు బీసీసీఐ అధికారులు. ఈ క్రమంలోనే అటు అన్ని ఫ్రాంచైజీ లు  కూడా తమ జట్టుకు ఎంతో వ్యూహాత్మకంగా బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యయ్ అన్న విషయం తెలిసిందే. కేవలం జట్టులో ఉన్న ఆటగాళ్లు మాత్రమే కాదు కోచింగ్ సిబ్బందిని కూడా పరిగణలోకి తీసుకొని వ్యూహాత్మకంగానే ఐపీఎల్ లో బరిలోకి దిగి టైటిల్ కొట్టాలని సిద్ధంగా ఉన్నాయ్ అన్ని జట్లు. ఇకపోతే ఒకప్పుడు ఐపీఎల్ బెస్ట్ బౌలర్ గా పేరు సంపాదించుకున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఐపీఎల్లో కోచ్ అవతారం ఎత్తాడు అన్నది అర్ధమవుతుంది.



 ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు పడగొట్టి బెస్ట్ బౌలర్ గా గుర్తింపు సంపాదించుకున్న లసిత్ మలింగ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా ఎంపిక అయ్యాడు అని తెలుస్తుంది
 ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ  తమ సోషల్ మీడియా ఖాతాల్లో అధికారికంగా ప్రకటించారు.  ఐపీఎల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన మలింగ 122 మ్యాచ్ లలో 175 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే తక్కువ సమయంలో ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. అలాంటి మలింగా కోచ్ గా ఎంపిక అయ్యాడు అని చెప్పడంతో అభిమానులు అందరూ ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: