ధోనీ హాఫ్ సెంచరీ.. ఏమన్నాడో తెలుసా?
ఇలాంటి సమయం లోనే మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతం గా రాణించాడు. మొదట్లో మహేంద్రసింగ్ ధోని అందరూ బ్యాట్ మెన్స్ లాగానే నెమ్మదిగా ఆడుతున్నట్లు కనిపించాడు. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని వాటిని చూసి అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశలో మునిగి పోయారు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతంగా రాణించాడు. ధనాధన్ పటపట్ అనే రేంజ్ లో ఫోర్లు సిక్సర్లతో చెలరేగి పోయాడు.
ఈ క్రమం లోనే చాలా రోజుల తర్వాత మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనే చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోనీ అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడం పై స్పందించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ధోనీ ఇన్నింగ్స్ బాగుందని కితాబు ఇచ్చాడు సచిన్ టెండూల్కర్. ధోని నెమ్మదిగా స్టార్ట్ చేసాడు కానీ తన అనుభవం ప్రశాంతత దూకుడు కామన్సెన్స్ ఉపయోగించడంతో చెన్నై సూపర్ కింగ్స్ మంచి స్కోర్ చేయగలిగింది అంటూ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.