రోహిత్.. ఇక కెప్టెన్సీ వదిలేయ్?
అయితే కేవలం టైటిల్ గెలిపించడమే కాదు మైదానంలో తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తూ ఎంతో అలవోకగా మ్యాచ్ ని తన వైపు తిప్పుకోవడం లో రోహిత్ శర్మ దిట్ట అని చెప్పాలి. కానీ ఈసారి ఐపీఎల్ సీజన్ లో మాత్రం రోహిత్ వ్యూహాలు ఫలించడం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కు గడ్డు పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. మొదటి మ్యాచ్లోనే పరాజయం పాలైంది ముంబై ఇండియన్స్. ఇలా మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన సీజన్లో ముంబై ఇండియన్స్ కప్ గెలుస్తుంది. ఈసారి కూడా అలాగే జరుగుతుంది అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా ఓటమి చవిచూసింది.
అదేంటి ఎక్కడో తేడా కొడుతుంది అని అనుకున్నారు.ఇక ఇటీవల జరిగిన మూడో మ్యాచ్లో కూడా కోల్కతా చేతిలో ఓడిపోయి ఇక పాయింట్ల పట్టికలో చిట్ట చివరికి వచ్చేసింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే ముంబై ఇండియన్స్ వరుస ఓటమి చవి చూస్తూ ఉండటం పై ఇటీవలే ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రాజ్ గురు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్సినీ రోహిత్ శర్మ వదిలేయాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ వరుసగా విఫలమవుతున్నాడు. అందుకే కెప్టెన్సీ వదిలేసి కుమార్ యాదవ్ కు అప్పగించాలి. అప్పుడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. రోహిత్ చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అందుకే బెస్ట్ బ్యాటింగ్ రావాలంటే కెప్టెన్సీ వదిలేయడమే బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతను బ్యాటింగ్లో పేలవ ఫామ్ టీమిండియాకు పెద్ద మైనస్ గా మారుతుంది అని చెప్పుకొచ్చాడు..