ఐపీఎల్ : కేఎల్ రాహుల్ జేబుకు చిల్లు పడింది?

praveen
గత ఏడాది ఐపీఎల్ సీజన్ మేరకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్   ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు కెప్టెన్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక తనదైన కెప్టెన్సీలో జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు కె.ఎల్.రాహుల్. ఇకపోతే ఇటీవల లక్నో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.  ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో లక్నో ఇటు లక్ష్యఛేదనలో డీలా పడిపోయింది. దీంతో బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.


 ఇక ప్రస్తుతం లక్నో జట్టు 4 వ స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం  అయితే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు ఇక ఇప్పుడు జరిమానా పడింది  అయితే ఇలా జరిమానా పడింది అంటే స్లో ఓవర్ రేట్ కారణంగానే పడి ఉంటుంది అనుకుంటున్నారు కదా అలా అనుకుంటే పొరపాటే. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అంపైర్ల పై ఆగ్రహం వ్యక్తం చేయడం తోనే  ఈ జరిమానా పడటం గమనార్హం. జరిమానా విధించడానికి కేఎల్ రాహుల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసారూ రిఫరీలు.  ఏ కారణంతో కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉల్లంఘించారనే విషయాన్ని మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ కు రావలసిన మ్యాచ్ ఫీజులో ఏకంగా 20 శాతం మేర కోత విధించేందుకు రిఫరీలు నిర్ణయించడం గమనార్హం. ఓటమి బాధలో ఉన్న కేఎల్ రాహుల్ కు పార్ధన నియమావళి ఉల్లంఘన కారణంగా జేబుకు చిల్లు పడింది అని చెప్పాలి. అంతేకాదు ఇక కేఎల్ రాహుల్ నిబంధనలు ఉల్లంఘించడం లెవెల్ 1 అఫెన్స్ గా అభివర్ణించారు రిఫరీలు. ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 163 పరుగులకే మాత్రమే చేయగలిగింది. దీంతో 18 పరుగుల తేడాతో విజయం  సాధించిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంకు చేరుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: