కోహ్లీ, రోహిత్.. మా ఆశలన్నీ మీ పైనే?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో మెయిన్ పిల్లర్ లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు ఎవరు అంటే భారత క్రికెట్ ప్రేక్షకులందరూ చెప్పే పేరు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ. వీరిద్దరూ ప్రస్తుతం భారత క్రికెట్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు మాత్రం ప్రతి మ్యాచ్లో కూడా అందుబాటులో ఉంటారు. ఇక ఆటతీరు లో కూడా ఎవరికి వారే సాటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకరు తన అద్భుతమైన బ్యాటింగ్తో సిక్సర్లు ఫోర్లతో చెలరేగి హిట్ మ్యాన్ గా పేరు సంపాదించుకుంటే.. మరొకరు ఇక భారీగా పరుగులు చేస్తూ రన్ మిషన్ అంటూ అభిమానులతో ముద్దుగా పిలిపించుకున్నారు.



 ఇలా ఫార్మాట్ ఏదైనా సరే ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ సృష్టింఛే విధ్వంసం అంతా ఇంతా కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ఇక మొన్నటివరకు విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగితే.. ఇక కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అటు మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా  మారిపోయాడు రోహిత్ శర్మ. ఇక అసలు విషయానికి వస్తే ఇలాంటి కీలకమైన క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రం పేలవమైన స్థానంలో కొనసాగుతున్నారు. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ ముంబై జట్టులో రోహిత్ శర్మ కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు.  తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. భారత క్రికెట్ కు పిల్లర్ల లాంటి ఇద్దరు క్రికెటర్లు ఇలా రాణించడం పై అందరూ అవాక్కవుతున్నారు.



 అప్పుడు పరుగుల వరద పారించి రికార్డులు కొల్లగొట్టిన వీరు ఫెయిల్యూర్ చూసి బాధ పడి పోతున్నారు  అభిమానులు. అయితే ఐపీఎల్ లో సరిగా ఆడక పోయినా పర్వాలేదు కానీ రానున్న రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం  ఇద్దరి క్రికెటర్లు పుంజుకుని మునుపటి ఫామ్ లోకి రావాలి అని అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఒకవేళ ఇదే పేలవమైన ఫామ్ను కొనసాగిస్తే అటు టీమిండియాకు వరల్డ్ కప్ దక్కడం కలగానే మిగిలిపోతుంది అంటూ చెబుతూ ఉన్నారు అభిమానులు. ఇద్దరు సీనియర్ క్రికెటర్లు రానున్న మ్యాచ్ లలో ఫామ్ లోకి వస్తారా లేదా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: