రసపట్టులో 'లార్డ్స్ టెస్ట్'... గెలిచేది వారేనా ?

VAMSI
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇక్కడ మూడు టెస్ట్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ లార్డ్స్ వేదికగా నిన్న ఆరంభం అయింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ అండర్ సన్ 4 వికెట్లు మరియు పాట్స్ 4 వికెట్లు విజృంభణతో కేవలం 132 పరుగులకే చాప చుట్టేసింది. ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కు ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇంగ్లాండ్ కూడా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 141 పరుగులకే కుప్పకూలిపోయింది. కివీస్ సీనియర్ బౌలర్ సౌథీ 4 వికెట్లతో చెలరేగి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఇందుకు బౌల్ట్ కూడా 3 వికెట్లతో మంచి సహకారం అందించాడు. కాగా న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ లో తడబడుతోంది.

దీనిని బట్టి చూస్తే ఫలితం ఈ రోజులోనే తేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక లార్డ్స్ లో ఎవరు విజేతగా నిలవనున్నారు అనే విషయం ఇప్పుడు చర్చలో ఉంది. రెండు జట్లలోని బౌలర్లు విజృంభణ ముందుకి బ్యాట్స్మన్ నుండి ఎటువంటి సమాధానం ఉండడం లేదు. ఈ రోజు కేవలం రెండవ రోజు మాత్రమే అప్పుడే మ్యాచ్ కీలక దశకు చేరుకుంది. ఈ రోజులో ఇంకా 50 కి పైగా ఓవర్లు మిగిలి ఉండగా ఫలితం ఎలా ఉండనుంది అనేది తెలియాల్సి ఉంది.

అయితే క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం క్రీజులో వచ్చే కొత్త బ్యాట్స్మన్ కు నిప్పులు చెరిగే బంతులతో బౌలర్లు పరీక్ష పెడుతున్నారు. అయితే కనీసం కొన్ని బంతులు నిదానంగా చూసి ఆడితే తర్వాత ఆడడం ఈజీ అవుతుంది అని అంటున్నారు. ఇక న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గెలవన్నా ? లేదా మ్యాచ్ ను డ్రా గా ముగించుకోవాలన్నా కూడా అసాధారణమైన ఆటతీరును ప్రదర్శిస్తేనే అది సాధ్యం అవుతుంది. కాగా గొప్ప ఇన్నింగ్స్ ఆడగలిగే లాతమ్, విలియమ్సన్ లు ఇప్పటికే పెవిలియన్ చేరగా... ఇప్పుడు భారం అంతా కాన్ వే, గ్రాండ్ హోమ్ మరియు మిచెల్ ల మీదనే ఉంది. మరి కివీస్ పోరాడి గెలుస్తుందా లేదా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతుందా అన్నది తెలియాల్సి ఉంది.      


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: