అనుమానం లేదు.. టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ అతనే?
ఇంతకుముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్,ఆజింక్య రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా వ్యవహరించారు. ఇప్పుడు ఈ లిస్టులో కె.ఎల్.రాహుల్ కూడా చేరిపోయాడు. అయితే అటు ఐపీఎల్లో లక్నో జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. కె.ఎల్.రాహుల్ ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో కె.ఎల్.రాహుల్ ముందువరుసలో ఉన్నాడని మిగతా అందరూ కూడా అతని వెనకే ఉన్నారని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.
అదే సమయంలో మొన్నటి వరకు అసలు కెప్టెన్సీ రేసుతో సంబంధం లేని హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు కెప్టెన్గా సక్సెస్ అయి జట్టుకు టైటిల్ అందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతే కాదు కెప్టెన్సి రేస్ లోకి కూడా వచ్చేసాడు. ఇక హార్దిక్ పాండ్యా కాకుండా రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు అన్న విషయం తెలిసిందే.